మన గమ్యం ఎటు వైపు

by 12:09 AM 0 comments
మన గమ్యం ఎటు వైపు

మనమెక్కడకి పోతున్నాం .....

చేతులారా మనకున్న వనరులని నాశనం చేసుకుంటూ...మన పరిధుల్ని కుదించుకుంటూ...పక్క వాళ్ళతో సంబంధాలను తగ్గించుకుంటూ...మనం గీసుకున్న గిరి లో ఒంటరి గా ఎందుకు మిగులుతున్నాం..

మన దేశం లో మన పెద్ద వాళ్ళు ఊహించి ఉండరు, మంచి నీళ్ళు కొనాల్సి వస్తుందని....

  మంచి నీళ్ళు ఎందుకు కొనాల్సి వస్తుంది? శుద్ధమైన నీరు దొరక్క..నీరు పరిశుద్ధంగా ఎందుకు లేదు? 

ఒకప్పుడు  మా ఊర్లో వ్యవసాయం కోసం తీసిన కుంటలే మంచి నీటికి ఆధారం..ఊర్లో అక్కడక్కడా గిలక బావులున్నా అవి తాగడానికి ఉపయోగించే వాళ్ళు కాదు...పాక్కనే పారుతున్న పాలేటికీ వెళ్లి నీళ్ళ చెలమల్లో తెచ్చుకునే వాళ్ళు.. కొన్నాళ్ళకి ఏటి నుంచి ఊర్లోకి పైపులు వేసి నీటిని సరఫరా చేయడం మొదలు పెట్టారు..అలా పోను పోను కుంటల వాడకం తగ్గిపోయింది.కావిళ్ళు మూలాన పడ్డాయి..ఏటి లో నీళ్ళు రుచి గా లేకపోవడం తో మళ్ళి కుంట కి వెళ్లారు, కానీ అలవాటు తప్పేసరికి తాగలేకపోయారు...ఇపుడు నీళ్ళ బబుల్స్ రాజ్యం చేస్తున్నాయి ... ఇంటికి తెచ్చివ్వడం, రుచి గ ఉండటం ఇలాటి చాల కారణాలు....దీని కన్నా ముందు వాటర్ బాటిల్స్ లో అమ్మడం మొదలెట్టారు...అవి ప్రైవేటు కంపెనీ లకి కట్టబెట్టి అందులో ప్రభుత్వానికి అతి తక్కువ లాభం తీసుకుంటూ ఎన్నో వనరుల్ని ధారా దత్తం చేసారు...దీని వాళ్ళ కొంత మంది వ్యక్తులు బాగుపడ్డారు..దీని వల్ల ప్రజలు సోమరులయ్యారు...

ఈ రోజు రైతు పరిస్థితి ఏంటి..మనకెందుకులే అనుకుంటున్నారా? 
నిన్న మార్కెట్ కి వెళ్తే బోర్డ్ మీద 16 రూపాయలున్న కూరగాయలని నిలువునా 20 కి అమ్ముతున్నారు..ఏంటిది అంటే కొంటె కొనండి లేకపోతే పొండి...అన్న సమాధానం.ఎవ్వరు ఏంటని అడగరు, ఒక వేళ ఎవరైనా అడిగితే వాడికి తోడుగా ఎవరు నిలవరు..ఇది కాకా హేళనగా చూసి 'బయల్దేరాడండి దేశాన్ని ఉద్దరించడానికి' అని ఓ మాట ని పోతారు...మనంత స్వార్ధపరులు, పిరికి వాళ్లు ఎక్కడ ఉండరేమో...

ఈ రోజు 32 రూపాయలు అమ్ముతున్న మిర్చి రైతు కు ఇచ్చేది మాత్రం 15 రూపాయలే....ఎం మిగులుతుంది..అసలెందుకు వ్యవసాయం చెయ్యలయ్యా? ఒక పని చేస్తే రైతులమే అన్ని పంచుకుంటాం, ఇంకెవరికి ఏమి అమ్మం...అంటే వస్తు మార్పిడి, వడ్లు ఇచ్చి పప్పు ధాన్యాలు...ఇలా చివరికి ఏదైనా పని కావాలన్న అంటే వైద్యుడు వైద్యం చేసిన ఇచ్చేది అదే...ఒకప్పుడు ఇలానే కదా జరిగేది....ఇప్పుడు అదే చేస్తాం అంటే..ఎం చేస్తారు మీరు ? పంది కొక్కుల్లా మేస్తున్న ఈ రాజకీయ నాయకులూ, దళారులు ఎం చేస్తారు? మా దగ్గర డబ్బులున్నాయి కావాలంటే బయట కొనుక్కుంటాం అంటారు .... న్యాయం గా అయితే రైతు కి ఎంత రావాలి..మనం ఎంత ఖర్చు పెడుతున్నాం..అది కనుక అంత రైతు కి వెళ్తే ఎంత సంతోష పడతాడో తెల్సా, ఈ పని మీ వల్ల కాదు వెళ్లి ఏదైనా ఉద్యోగాలు చేస్కొండి అని తన కన్నా బిడ్డలని దూర తీరాలకి పంపడు...కష్టపడతాడు...మంచి పంటని ఇస్తాడు ...ఈ నాడు వ్యవసాయం చేస్తున్న అంటే కనీసం పిల్లనిచ్చే వాడు కరువయ్యాడు...మరి రైతు అంత చులకన అయ్యాడు ..... ఇలా ఉంటె రైతు ఎందుకు వ్యవసాయం చేస్తాడు? అందరు కుల వృత్తులు వదిలేసి కంప్యూటర్ ఇంజనీర్ లు, పెద్ద పెద్ద ఉద్యోగాలు చేస్తుంటే తనకేం ఖర్మ..కాని రైతు కి పొలం తో విడదీయని బంధం ఉంటుంది, దాన్ని వదులుకోవడం చాల కష్టం, అందుకే ఇంకా పొలాల్లో పడి కష్టపడుతున్న వాళ్ళు చాల మందే ఉన్నారు... కూలికి మనుషులు దొరక్క బాబ్బాబు రమ్మని బ్రతిమలుకుంటూ..ఏమో చెప్పాలంటే ఈ టపా సరిపోదు....మరి రైతు ని ఇలా చేస్తుంది ఎవరు ? వ్యవసాయం ఇలా అయితే మన పరిస్థితి ఏంటి అని ఎవరికైనా పట్టిందా? చేతులారా మనమే చేసుకోడం లేదా? 

కోర్టు- ఈ మాట అంటే మనందరికీ చెమటలు పడతాయి...దాని చుట్టూ తిరగాలేమని, దూరం గ ఉండమని చెప్తారు...ఎందుకలా? ఎన్ని లక్షల కేసులు పెండింగ్ లో ఉన్నాయి? ఎందుకిన్ని వాయిదాలు పడుతున్నాయి? ౧౦౦ మంది దోషులైనా శిక్ష తప్పించు కోవచ్చు కాని ఒక్క నిర్దోషి కి  కూడా శిక్ష పడకూడదని చట్టం చెబుతుంది...ఇది నిజమా? అలా జరుగుతుందా? ఎంత మంది తప్పించుకోవడం లేదు? మరి ఎవరు బలౌతున్నారు? అస్సలు కేసు ని ఎందుకు వాయిదా వేస్తారు? అన్ని ఉన్న వాయిదా పడుతుంది...ఇలా అయితే ఎవడు భయపడతాడు? తప్పు చేయడానికి ఎవడైనా జంకుతాడ? మా పక్క ఊర్లో డబ్బులు తిన్న పోలీసు ఎస్ ఐ తప్పు చేసిన వాడికి వంత పాడి, నిర్దోషుల మీద FIR రాసి కోర్టు లో వేస్తే వాళ్ళు ఇప్పటికి తిరుగుతూనే ఉన్నారు, కొందరు ఆస్తులు పోగొట్టుకున్నారు....కసబ్, అఫ్జల్ గురు లాటి వాళ్ళు ప్రశాంతం గా ఉన్నారు? దేనికిదంతా ? బధ్రత  ఏది?

చదువులు...అన్ని ఆంగ్ల మాధ్యమం లోనే...తెలుగు చాలా మందికి రాదు ఈ మాట చాల మంది తల్లి తండ్రులు మురిసిపోతూ చెప్పుకుంటారు..ఈ పిల్లలే రేపు ఆ కన్న వాళ్ళ వైపు కన్నెత్తి కూడా చూడరు..మేమింత చేస్తే అని అప్పుడు ఏడుస్తారు అది వేరే సంగతి...మరి ఈ చదువులు దేనికోసం, ఉద్యోగాల కోసమేనా? ఆకసం లో ఫీజులు...డొనేషన్ లు చిన్న నాటి నుంచే అమిత భారం వేస్తూ..ఆట పాట లకి దూరం గ ఉంచుతూ మర మనుషుల్లా తాయారు చేస్తున్నారు? దేని కోసం ఇదంతా ? 

ప్రచార మాధ్యమాలు-- టీవీ లు వార్త పత్రికలూ...ప్రత్యేకించి ఒకరిని బలపరుస్తూ అదే నిజమని జనాల్ని నమ్మిస్తూ నైతిక విలువలు, సామజిక స్పృహ లేకుండా బ్రతుకుతున్నారు...ఇది ఒక బ్రతుకేనా...విలువలకి కట్టుబడి ఉన్న ఒక్క ఛానల్ ని చూపించండి...నేనైతే దూరదర్శన్  అంటాను...వీళ్ళంతా మనల్ని ఎటు వైపు నడిపిస్తున్నారు? దిగజారిపోయారు...సగం సమాజం ఇలా కావడానికి వీళ్ళు ముఖ్య కారణమని నేను నమ్ముతాను....

పర్యావరణం-- ఇది నానాటికి తీసి కట్టు అవుతుంది...కారణం మనమే...మనిషి స్వార్ధం ఇందుకు కారణం..అడవులు కూడా పూల కుండీలలో పెంచే రోజు వస్తుంది...

రాజకీయనాయకులు....మన దేశ రాజకీయ  నాయకుల  కంటే కసబ్ లాటి వాళ్ళు మేలు...కనీసం వాడొచ్చి ఈ రాజకీయ నాయకులని చంపినా పోయేది.వద్దులే జాలితో వాళ్ళ పెళ్ళాం పిల్లలు వస్తారు పాలించడానికి 

డబ్బున్న వాళ్ళు గాలి కొంటారు, నీరు కొంటారు దేన్నైనా కొనగలరు...మనం భవిష్యత్తులో పాకులాడబోయేవి  అన్ని గతం లో ఇప్పుడు ఉచితం గా ప్రకృతి ఇస్తున్నవే..అవే మనకి అవసరాలు...చేతులారా మనం నాశనం చేసుకొని రేపు వాటికి కోసం వెంపర్లాడ బోతున్నాం...ఆ రోజు నాకు చూడాలని లేదు...మన తరువాతి తరం మనం చేసిన తప్పు కి శిక్ష అనుభవించ బోతుంది....అప్పుడు వాళ్లకి కావాల్సింది ఆడి కార్లు, duplex ఇల్లు, బ్యాంకు బాలన్సు కాదు..పచ్చని నేల, శుబ్ర్హమైన గాలి, మంచి నీరు...ఒకటి నిజం మనల్ని అమ్మ నా బూతులు తిట్టుకుంటారు...కాని వాళ్లకి ఇవన్ని ఉన్నాయని తెలియక పోతే అదే ప్రపంచం అవుతుంది...

 దయచేసి మేలుకోండి..ఎవరో స్వార్ధం కోసం మనం, మన భావి తరాలు బలి కాక ముందే 

0 comments:

Post a Comment