ఈ రాజకీయాలు ఎవరికోసం?

by 2:35 AM 1 comments


ఈ రాజకీయాలు ఎవరికోసం?


రాజకీయాలు మనకి కాదు అని మనం అనుకుంటూనే ఉన్నాం...మనకి మంచి జరగడం లేదని బాధ పడుతూనే ఉన్నాం. ఎక్కడో ఓ సామెత విన్నట్టు గుర్తు, మట్టి పనికైనా మన వాడిని పంపాలని. మరిప్పుడున్న రాజకీయ నాయకులూ ఎవరికేమి చేస్తున్నారు? మీరు గమనించారా? అందరు వాళ్ళు పదవుల్లో ఉండటానికి, వాళ్ళ తరువాతి వాళ్ళకి సరి ఐన దారిని ఏర్పరుస్తున్నారు. ఇంకా చాల అభియోగాలున్నాయ్..అవన్నీ మనకి బాగా తెల్సు.

ఇప్పుడున్న రాజకీయనాయకులలో ఎక్కువ మంది వ్యాపారస్తులు, రాజకియాన్నే వ్యాపారం గ చేసుకున్న వాళ్ళు, రౌడీ లు, గుండా లు, హంతకులు ఇలా నేర చరిత్ర కలిగిన వాళ్ళు, కుల ప్రాతి పదికన రాజకీయాల్లోకి వచ్చిన వాళ్ళు....ఇలా.
వీళ్ళు ఎవ్వరికి మంచి చేయగలరు?

నష్టపోతున్నది ప్రజలు, తమ ప్రతినిధులుగా ఎన్నుకున్న వాళ్ళు నిజంగా తమ ప్రతినిధులా? ఇక గత్యంతరం లేక ఎన్నుకున్న వాళ్ళు..అందునా 100 మంది ఉన్న నియోజక వర్గం లో 4 పార్టీ లు ఎన్నికలలో పాల్గొంటే, అందులో 40 మంది వోట్లు వేసే అర్హత ఉండదు(పిల్లలు, యువకులు ). ఇక మిగిలిన 60 లో 20 మంది వోట్లు వెయ్యరు. ఆ మిగిలిన 40 లో 4 పార్టీ లకి వోట్లు వేస్తే అందులో అత్యధికం గ వోట్లు వచ్చిన పార్టీ ఆ నియోజక వర్గం లోని 100 మంది ని పాలిస్తుంది. మహా అయితే ఆ పార్టీ కి 20 వోట్లు వస్తాయేమో. మరి ఆ పార్టీ కి అందరిని పాలించే హక్కు ఉందా?

ఎక్కడైనా సమస్యలు ఎవరికీ వస్తాయి? ప్రజలకి అనకండి. అది నిజమే , కాని అందులో కొన్ని వర్గాలు కనుక బాగుంటే ప్రజలు అందరు బాగుంటారనే నా ఉద్దేశ్యం.

 అందులో మొదట గా వచ్చేది రైతులు. ప్రతి ప్రభుత్వం నిర్లక్ష్యం చేసేది ముందు రైతులనే. ఎందుకంటే వాళ్ళలో ఐకమత్యం ఉండదు. మాకు ఇది కావాలని అడగరు. అడిగిన వాళ్ళని కాల్చిపడేసినా దిక్కు ఉండదు. ఎవడు అడుగుతాడు? అడగడానికి వాడిది నా  వర్గం కాదు కదా..నా కులం కాదు కదా..బడుగు రైతు ఉంటె ఎంత పోతే ఎంత...ఆశ్చర్యం గా వాళ్ళ దగ్గర నుంచే ఎక్కువ వోట్లు వస్తాయి. కాని వాళ్ళ ని ముక్కల్లు గా చేసి...కుల,వర్గ,ప్రాంత ప్రాతిపదిక మీద విడగొడతారు. నేను ఖచ్చితం గా చెప్పగలను అత్యంత దగపడేది ,నష్టపోయేది రైతే. మరి రైతు సమస్యలని ఎవ్వరు తీరుస్తారు? చంద్రబాబు పద యాత్ర చేసినా, జగన్ ఓదార్పు చేసినా, నారాయణ, రాఘవులు పొలాల్లో పడి తిరిగినా  అది వోట్ల కోసమే. మరి ఎవరున్నారు? అడగడానికి? ఎవరో రైతు నాయకులట అప్పుడప్పుడు వినిపిస్తుంది నాకీమాట? ఎవరు వీళ్ళు ఎలా ఉంటారు? మరి రైతు సమస్య వినిపించడానికి ఒక రైతు అసెంబ్లీ కి వెళ్ళ లేడా?

చేతివృత్తుల వాళ్ళు..చేనేత కార్మికులను చూస్తూనే ఉన్నాం...మరి వీళ్ళ సమస్య వోట్ల కోసం వచినప్పుడో , ఎవరైనా చచ్చినప్పుడో తప్ప గుర్తుకు వస్తుందా ?  మరి వీళ్ళ బాధ చెప్పడానికి ఒకరు కావాలి..

ఉద్యోగులు (ప్రభుత్వ) . వీళ్ళు ఎలా ఐనా వాళ్ళ కోరికల్ని తీర్చుకోగాలరని నా నమ్మకం. వాళ్ళు స్వార్ధపరుల్లా ఉన్నంత కాలం దేశం , సమాజం బాగుపడదు.కాని వీళ్ళ అవసరాలు కూడా సకాలం లో తీరిస్తే, వీళ్ళని సరిగ్గా నడపగల,వినియోగించుకోగల  నాయకుడు ఉంటె  వీళ్ళు దేశాన్ని నిలబెట్టగలరు. వీళ్ళలో ఉపాద్యాయులు,డాక్టర్లు,పోలీసులు,న్యాయవాదులు ఇలా ఎంతో మంది ఉన్నారు.మరి  వీళ్ళ సమస్యలను వినిపించడానికి ఒక ప్రతినిధి అసెంబ్లీ కి వెళ్ళ లేడా? 

విద్యార్దులు, వీళ్ళకి వోటు హక్కే సరిగ్గా లేనప్పుడు అనకండి...దేశాన్ని సక్రమం గా నడపడానికి వీళ్ళు ప్రాణం లాంటి వారు. వీళ్ళకి సమస్యలు లేవా? ఉంటాయి. అవి తల్లి తండ్రులు , గురువులు చూస్తారు...కాని ప్రపంచాన్ని గురించి బాధ పడేది, ఆలోచించేది ఈ యువతే..మరి ఇలాటి యువత కి ప్రతినిధి గా ఒకరు అసెంబ్లీ కి వెళ్ళ లేరా?

వ్యాపారులు, ఉన్నదంతా వీళ్ళే కదా అనకండి. బాగు పడుతుంది బడా వ్యాపారులే తప్ప..చిన్న వాళ్ళు కాదు...ఈ రోజు వాల్ల్మర్ట్ లాంటి పెద్ద కంపెనీ లు వచ్చి చిల్లర దుకాణాలను మింగేస్తుంటే ఒకరైన కిక్కురుమనలేదే? మరి వాళ్ళ కోసం ఒకరు కావాలి గా?

ఇలా ఒక ప్రజా వర్గానికి ప్రతినిధి గా పంపబడిన వాళ్ళ పని తీరుని పరికించే హక్కు ప్రజలకు ఇవ్వండి..పని చెయ్యకపోతే, పక్కన పెట్టేస్తాం జాగ్రత్త అన్న హెచ్చరిక ఉంటె ఎవడైనా పని చెయ్యక చస్తాడా?
మరి అసెంబ్లీ నిండా ఉన్నది ఎవ్వరు?వీళ్ళు వాళ్ళ కోసం తప్ప ప్రజలకోసం కాదని రుజువులు అక్కరలేదు....చెప్పండి మీరు నిజంగా ప్రజల మేలు కోరే వారైతే (పిచ్చి ప్రశ్న కదా ), ప్రజల సమస్యలు తెల్సిన , తీర్చగల ప్రజల లోంచి వచ్చిన మనిషిని నిలిపి గెలిపించ గలరా?  వాళ్ళ కోసం చట్టాలను కాంగ్రెస్సు పార్టీ CM  ని మార్చినంత సులువుగా మార్చగలరు. ఉదాహరణకి అదేదో వాళ్ళ చుట్టాలని వాళ్ళతో పాటు ఉచితం గా ప్రయాణించవచ్చు అన్న చట్టాన్ని చిటికెలో ఆమోదింప చేసుకున్నారు. మరి మిగతావాటికి నిధులు ఉండవు కదా..
ఎన్నో వెనుకబడ్డ ప్రాంతాలు ఉన్నాయి..నల్లగొండ లో శుబ్రమైన నీరు లేక దశాబ్దాల నుంచి అనారోగ్యం లో పడి కొట్టుకుంటుంటే, పక్కనే కృష్ణ నది ఉండి వాళ్ళు ఎదురుచూస్తూనే ఉన్నారు. ఎక్కడో హైదరాబాదు లో ఉన్న మినెరల్ వాటర్ ప్లాంట్ కి నీళ్ళు ఇవ్వడానికి కృష్ణ నుంచి పైపులు వేసి అతి తక్కువ ధరకి నీళ్ళు ఇస్తారా? మా పంట పొలాలని సెజ్ ల పేరు చెప్పి ఎవడికో  దోచి పెడతారా? అడిగితే చంపుతారా? కరువు ప్రాంతాలు..గిరిజన ప్రాంతాలలో వ్యాధులతో ప్రజలు చాచ్చిపోతుంటే ఎవరు పట్టించుకున్నారు? ఎవరికోసం ఈ రాజకీయం?
ప్రతి వర్గానికి కొందరు చొప్పున ప్రతినిధులుగా వెళ్ళగలిగినప్పుడే అన్ని వర్గాలవారికి( ఇక్కడ కులం కాదు,మతం కాదు,ప్రాంతం కాదు ) న్యాయం జరుగుతుంది. కాని దీన్ని ఎవ్వరు అమోదించరు. అక్కడ  కూడా మేమంటే మేమని   వీళ్ళలో గొడవలు వస్తాయేమో.  

ఏదో రాయాలనుకున్నా. అది అందరికి మంచి చేయలేకపోవచ్చు. కాని మాకేదో జరుగుతంది ఆశపడే వాళ్ళ కోసం ఎవరున్నారు? అది ఎవరౌతారు? ఒక రైతు, ఒక విద్యార్ధి, ఒక చిరు వ్యాపారి, ఒక చేనేత కార్మికుడు, ఒక ప్రభుత్వ ఉద్యోగి ని అసెంబ్లీ లో చూడగలమా?

కలే కాబోలు.. 

1 comment:

  1. అవును సరిగ్గా చెప్పారు

    ReplyDelete