భారత రాజకీయాలు

by 6:04 AM 0 comments
మనకు స్వాతంత్ర్యం తెచ్చిపెట్టారని, స్వాంతంత్ర్య సమరయోధులను నాయకులను చేశాము. అక్కడ కూడా అవకతవకలు జరిగాయి.

వెన్నుముక లా నిలిచిన గాంధీ కుటుంబం గాలికి కొట్టుకుపోతే, గాంధీ ని ఇంటి పేరు చేసుకొని నెహ్రు కుటుంబం రాచరిక వ్యవస్థ సాగిస్తూ వస్తుంది. ఇలా దేశం కోసం జీవితాల్ని త్యాగం చేసిన  ఎందరో నాయకులు, వారి కుటుంబాలు  మరుగునపడిపోయి కుక్కమూతి పిందెలు అధికారాన్ని చేపడుతూవస్తున్నాయి. వాళ్ళే స్వాతంత్ర్యాన్ని తెచ్చినట్టు, వాళ్ళు లేకపోతే మనకు భవిష్యత్తు లేదన్నట్టు నమ్మబలుకుతున్నాయి. దానికోసం కులం,ప్రాంతం,వర్గం,ధనం,అధికారం,కుట్ర,కుతంత్రం అన్నిటినీ వాడి అధికారం లోకి రావడానికి ప్రయత్నిస్తున్నాయి. అందులో ప్రజల నిర్లక్ష్యం, అవగాహనా  లోపం, ఐకమత్యం లేకపోవడం, ప్రజలు,వారి జీవన విధానాల మద్య అంతరాలు సహాయం చేస్తున్నాయి.

ఎక్కడ విన్నాను అమెరికా లో ఉంటున్న ఒక భారతీయుడు, ఈ మధ్యనే భారత దేశం వెళ్లి వచ్చిన ఒక అమెరికా దేశస్థుడిని అడుగుతాడు, "ఎలా ఉంది మా దేశం " అని . "అద్భుతం, అంత బావున్నాయి కాని పేరుకే అది భారత దేశమైనా అక్కడ ఒక్క భారతీయుడిని కూడా చూడలేకపోయాను. ఎవరికీ వారు మేము తమిళులం, మలయాళీలం, కన్నడిగులం, తెలుగు వాళ్ళం (ఇందులో మళ్ళీ రకాలు ), గుజరాతీలం, బెంగాలీలం అంటారే తప్ప ఒక్కడన్నా భారతీయుడిని అని చెప్పుకోవడం లేదు." అని అన్నాడట.నిజమే కదా, ప్రాంతీయ భావన ను రాజకీయ పార్టీలు పెంచి  పోషిస్తున్నాయి. జాతీయ భావనను  పెరగకుండా జాగ్రత్త పడుతున్నాయి.  మహారాష్ట్ర వాళ్ళు, గోదావరి నది మీద  డాం కడుతున్నారట తెలుగు వాళ్ళు అన్యాయం అయిపోతారు. తమిళులకు కావేరి జలాలు అందడం లేదు. ఆంధ్రా ప్రాంతంలో ఉన్న గ్యాస్ అంత గుజరాత్ కి తరలిపోతుంది, లాటి విషయాలను ఎక్కువగా చూపించి వాళ్ళు వేరు మనం వేరు, మన వనరులను వాళ్ళు లాక్కుపోతున్నారు  అనే  భావన అందరిలో నాటుతున్నారు. అందరు మన వాళ్ళే, కూర్చుని పరిష్కరించుకోవాలి. అదే చినా నొ పాకిస్తాన్ ఓ చొరబడితే దానికి మాత్రం శాంతి చర్చలు.


ఆశ్చర్యంగా కేంద్రం లో కాంగ్రెస్ ఉంటుంది, రాష్ట్రంలోనూ కాంగ్రెస్ ఉంటుంది. కాని ఆ చిచ్చు ని ఆరనివ్వదు.దానికో పరిష్కారం చూపదు. ఉదాసీనత చూపిస్తుంది. ఇక రాష్ట్రాల్లోనే చిచ్చు పెట్టి ప్రాంతీయ విద్వేషాలు రెచ్చగొట్టి ఆంధ్రులు,సీమ వాళ్ళు, తెలంగాణా వాళ్ళు అని రాజకీయ పబ్బం గడుపుకుంటూ అభివృద్ధి ని దగ్గరకు కూడా రానివ్వడం లేదు. ప్రపంచ వ్యాప్తంగా భారత దేశంలో ఇలాటివే జరుగ్తున్నాయన్న భావన పెరుగుతున్నా మౌనం వహిస్తుంది. ఆ దేశం వెళ్ళకండి, అక్కడ మృగాళ్ళు ఉంటారు, అని దేశాలు ఘోషిస్తుంటే, "భారత దేశము నా మాతృ భూమి భారతీయులందరూ నా సహోదరులు. నేను నా దేశమును ప్రేమిస్తున్నాను." అని ఎలుగెత్తి అరిచే మన భూమిలో పరాయి సంస్కృతితో పెరిగిన వాళ్ళే ఈ మృగాళ్ళు అని వాళ్లకు జ్ఞాపకం రాదు, అవసరం లేదు.

చైనా వాడు అక్కడెక్కడో ఒక ప్రాజెక్ట్ కడుతున్నాడట. దాని వల్ల మన దేశానికి నష్టం. మనం ఎం చేయాలి, దీనిపై ఎలా స్పందించాలి? మన భూభాగంలోకి అడుగు పెడితే దాన్ని ఎలా పరిష్కరించుకోవాలి? మన దేశం పై జరుగుతున్న టెర్రరిస్టు దాడులను ఎలా ఎదుర్కోవాలి లాటి అంశాలను ప్రజల్లో చర్చకు తెచ్చి ఇది మన దేశం, మనమంతా ఒక్కటే అన్న భావన పెంచాలి. అంతెందుకు రేపో మాపో చైనా మన సరిహద్దుల్లో సైన్యాన్ని మొహరించి, మన  మీదకు దండయాత్రకు వస్తుందంటే ఆ ఎవరో బోర్డర్ లో ఉండే వాళ్ళు కదా నష్టపోయేది అని ఊరుకోగలమా? ఎవడ్రా వాడు, మన దేశం మీదకి వచ్చే దమ్మున్న వాడు? మన సైన్యం ఎంత గొప్పది? రమ్మను చూసుకుందాం లాటి ఆలోచనలు మన మనసులల్లో ఉడుకుతుంటాయి. ఏ దేశం లో నైనా ఆ దేశ ప్రజలే ఉంటారు కాని, మన లాగ ప్రాంతాల ప్రజలు, భాషా ప్రజలు ఉండరు. మనల్ని అలా ఉండనివ్వడం లేదు.

అసలు ఈ రాజకీయ నాయకులకు ఎం అర్హత ఉందని ఎన్నికల్లో నిలబడనివ్వాలి? దేశానికీ సేవ చేశారా? కాదంట , పదవి ఇస్తే చేస్తారంట? అది ఎవడైనా చేస్తాడు. ముందు మీకున్న అర్హత ఏంటి? వినండి పిచ్చి ఎక్కుద్ది మనకి. ఒకడు అంటాడు, ప్రజలు నేను రావాలని కోరుకుంటున్నారు అని? ఇంకోడు మా తాతలు, నాన్నలు చేసిన సంక్షేమ  పధకాలు జనాలకి ఇంకా అందాలంటే నేను రావాలి, లేకపోతే జనం చచ్చిపోరు. పాపం లక్షల్లో జీతాలుండే ఉద్యోగాలు మానేసి ప్రజా సేవ చెయ్యడానికి వస్తారు. ఇలా సంవత్సరాలుగా చేస్తున్నా, అదేంటో ఆశ్చర్యంగా పిచ్చి జనాలకి బాగుపడటం చేత కాక అలానే ఉన్నారు.. ఆ రాజకీయ కుటుంబం లోంచి పిల్లకాయలు వచ్చి ఉద్ధరిస్తునే ఉన్నారు.

కొందరైతే ఈ నాయకులని చూసి ఓటేయ్యడం మానేస్తున్నారు.

దేశానికీ రక్షణ కలిపించే త్రివిధ దళాల నాయకులని ఎలా ఎన్నుకుంటారు? వాళ్ళ సర్వీస్ చూసే కదా?( ఖర్మకి వాళ్ళు కూడా ఈ రాజకీయనాయకుల కిందే పని చేయాలి...). మరి నాయకులని ఎందుకు అలా ఎన్నుకోరూ? ఎన్నో సర్వీసుల్లో ఉద్యోగాలు చేసి రిటైర్ అయిపోతున్న ఆఫీసుర్లు ఉన్నారు.పరిపాలనలో ఎంతో అనుభవం ఉన్న వాళ్ళు పెన్షన్ తీసుకుంటూ కాలం గడిపేస్తూ ఉంటారు.

రక రకాల సర్విసులున్నాయి.ప్రతి ప్రాంతంలో వివిధ అధికారులను నియమించి,  ఒక పదిహేనేళ్ళ సర్వీసు తరువాత కొందరు ఆఫీసుర్లను ఎన్నిక చేసి ప్రజల ముందుంచి "ఇదిగో ఈయన మీ ప్రాంతంలో ఇన్ని సంవత్సరాల నుంచి పని చేస్తున్నాడు. ఇదిగో ఈయన చేసిన మంచిపనులు.ఈ సారి ఎలక్షన్లో వీళ్ళని మీ ప్రాంతపు MLA లు నిలబెడుతున్నాము... మీరే ఓటు వేసి గెలిపించుకోండి " అని చెప్తే. ఆ ఆఫీసర్ కి కులం తో పని లేదు, మందు, డబ్బు, కుట్ర , కుతంత్రం, ప్రాంతీయత, వర్గం వీటితో వేటితో సంబంధం లేదు. ఎలాటి మంచి పనులు చేశాడు అని మాత్రమే చూస్తారు. ఒక చదువుకున్నవాడు, ఆ ప్రాంతం కష్ట సుఖాల మీద, అవసరాల మీద  అనుభవం ఉన్న వాడు,  దేశానికీ సేవ చెయ్యాలనే ఉద్దేశ్యంతో కష్టపడి చదివి ఈ శాఖలోకి వచ్చినవాడు మనకు నాయకుడౌతాడు.

ఈ రాజకీయ పార్టీల గోల ఉండదు. ప్రతోడు పార్టీ పెట్టడమే.

ఇక కష్టపడ్డ వాడికే ప్రతిఫలం. ఇక్కడ కుల ప్రాతిపదిక మీదనో, మత ప్రతి పదిక మీదనో ప్రజలు ప్రభుత్వ సహాయానికి అర్హులు కారు. ఆర్ధిక వెనుకబాటు తనం, సామజిక వెనుకబాటు తనం మాత్రమే అందుకు అర్హత.

దీనికి రాజకీయ నాయకులు ఒప్పుకోరు. ఒక రాజకీయనాయకుడు ఎన్నికైన ఒక సంవత్సరం తరువాత అవినీతి చేశాడని ఆరోపణలు వస్తే విచారణ పేరు మీద ఐదేళ్ళ పాటు వాడిని మనం భరించాలి. అంతే కాని వాణ్ని పీకి పారెయ్యరు. ఇటువంటి చట్టం తేవడానికి అందరి అభిప్రాయాలు కనుక్కోవాలంటూ కాలం వెళ్లబుచ్చుతారు. టెర్రరిష్టు లి దేశం లో చొరబడి ప్రాణాలు తీస్తున్నారు బాబో అంటే, ఆ సంఘటన జరిగినప్పుడు తీవ్రంగా ఖండిస్తారే తప్ప పోటా లాటి చట్టాలను అమలు చెయ్యరు. అదే "రాజకీయనాయకులంతా వాళ్ళ కుటుంబ సభ్యులను, వాళ్ళ బంధు జనాలని విమానంలో గాని రైలు లో గాని, బస్ (హీహీ అది అసాధ్యం కదా, ఎవడెక్కుతాడు(పల్లె వెలుగు బస్సుల్లో ఉంటుంది, reserved for MP/MLA ani ) ) లో గాని ఉచితంగా ప్రయాణించవచ్చు " అంటే ఆ బిల్లు ఏకగ్రీవంగా అమలౌతుంది.

ఇది పోవాలి, ఈ రాజకీయ నిరుద్యోగులు మన నాయకులైనంత కాలం , మనలో నిర్లక్ష్యం, స్వార్ధం గూడుక్కట్టుకున్నన్ని నాళ్ళు  భారత దేశంలో భారతీయుడిని పట్టుకోవడం దుస్సాధ్యం.

0 comments:

Post a Comment